కాకినాడ జిల్లా, తొండంగి మండలం, బెండపూడి గ్రామపంచాయతీ పరిధిలోని తమ్మయ్యపేట స్మశానవాటికలో దహన సంస్కారాలు జరుపుకునే ప్రజలకు తగిన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి స్మశానవాటికలో అవసరమైన భవన నిర్మాణం, నీటి సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని జనసేన పార్టీ నేతలు కోరారు. జనసేన తొండంగి మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు గారు, తమ్మయ్యపేట జనసేన నాయకులు అయ్యప్ప, బెండపూడి జనసేన నాయకులు బూసాల ప్రవీణ్ కుమార్, తొండంగి మండల జనసేన సహాయ కార్యదర్శి బూసాల సతీష్ కలిసి ఈ సమస్యను తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా, తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ యనమల రాజేష్ గారికి కూడా వివరించగా, వారు సమస్యను సానుకూలంగా స్వీకరించి, త్వరలోనే పరిష్కారం కోసం కృషి చేయాలని తొండంగి మండల ఎంపీడీవో గారికి ఆదేశాలు ఇచ్చారు. ఎంపీడీవో కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Share this content:
Post Comment