బోరుగడ్డ అనిల్ పై ఎస్పికి ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు
పాలకొండ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలను ఖన్డిస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పికి పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, వారి భార్య పిల్లలను దూషిన్చినందుకు గాను, మరియు పవన్ కళ్యాణ్ ని చంపేస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వైసీపి నేత బోరుగడ్డ అనిల్ కుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని గర్భాన సత్తిబాబు ఎస్పికి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. పార్వతీపురం జడ్పీటీసీ అభ్యర్థి వీరమహిళ పైల లక్ష్మి, మిడతాన ప్రసాద్, గర్భాపు నరేంద్ర, డొంపాక సాయికుమార్, పెనుగొండ రాజశేఖర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-14.10.42-1024x576.jpeg)