అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావంగా పాల్గొన్న జనసేన నాయకులు

అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్ష 1000 రోజులు అయిన సందర్భంగా ఈరోజు “అమరావతి నుండి అరసవల్లి పాదయాత్ర 2.0” వరకు రైతులు పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ పాదయాత్ర మొత్తం 60 రోజులలో పూర్తి అవుతుంది. రైతులు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు సంఘీభావంగా జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని రైతులు మద్దతుగా వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కడప మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, యర్రగోపుల నాగరాజు, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, నెల్లూరు రాజేష్, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.