ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు మరియు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో జనసేన నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ జనసేన నాయకులు పసుపులేటి శ్రీరామ్, సయ్యద్ అక్బర్ బాషా, చిన్నా జనసేన, దాడి భాను కిరణ్, గడ్డం వంశీ భాను చంద్ర, ఉప్పుగళ్ళ శ్రీనివాసులు, నాయుడు చంద్రారెడ్డి, పోలిచర్ల జానీ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment