జనసేన కార్యకర్త వినోద్ కు అండగా జనసేన నాయకులు

పిఠాపురం టౌన్, స్థానిక అగ్రహారంలో గంట వినోద్(బాబి) ఒక నిస్వార్థ జనసేన కార్యకర్త బలంగా పార్టీని సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు బలహీనుడు అయ్యాడు, అతని రెండు కిడ్నీలు పాడు అయ్యాయి. అతను చికిత్స చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతుండగా.. జనసైనికులు మైనబతుల చిన్న మరియు అల్లం కిషోర్ లు చెల్లుబోయిన సతీష్ దృష్టికి తీసుకుని వచ్చారు. అయితే ఆయన బాలిపల్లి అనిల్ మరియు పల్నాటి మధు సహకారంతో పలువురు జనసేన నాయకులను, కార్యకర్తలను సంప్రదించి సహాయం కోరగా పిల్లా శ్రీధర్(డాక్టర్) స్వయానా గంట బాబినీ కలిసి దైర్యం చెబుతూ తన వంతు 50000(యాభై వేల రూపాయలు) సహాయమును ప్రకటించారు. చెల్లుబోయిన సతీష్ మరియు అతని స్నేహితుడు గుండు జగదీష్ కలిపి 25000 ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు జనసేన తరుపున సహాయం చెయ్యడానికి సుముఖత చూపించారు.