ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుంటుంబానికి జనసేన నేతల పరామర్శ
- చందలూరు పుప్పాల మల్లెం కొండయ్య రైతు పేరు సర్వేనెంబర్ 155
ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలం పడమర గంగవరం పంచాయతీలోని రెడ్డినపల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు గురవారెడ్డి కుంటుంబాన్ని బుధవారం జనసేన నాయకులు పరామర్శించారు. గురవారెడ్డి కౌలుకు పొలం తీసుకుని సాగు చేస్తూ సరైన దిగుబడి రాక అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు, పడమర గంగవరం పంచాయతీ వార్డు మెంబర్ పసుపులేటి చిరంజీవి, నియోజకవర్గ నాయకులు పుప్పాల పాపారావు, వెంకటయ్యలకు తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి ధైర్యం చెప్పి పార్టీ అధినేత పవన్కల్యాణ్ దృష్టికి విషయం తీసుకెళ్లి పార్టీ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు జనసేన నాయకులు భరోసా కల్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతు ఆత్మహత్యలను నివారించేలా చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/vlcsnap-2022-07-27-18h19m10s543.png)