జనంకోసం జనసేన మహా పాదయాత్ర

రాజానగరం నియోజకవర్గఒ, కోరుకొండ మండలం, కనుపూరు గ్రామంలో సోమవారం జనంకోసం జనసేన మహా పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుస్తూ, ప్రతి గడప ఎక్కుతూ జనసేన పార్టీ విధివిధానాలను వివరిస్తూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీని ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ సంబంధించిన కరపత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రి దొరబాబు, బదిరెడ్డి దొరగారు, అడ్డాల శ్రీను, మన్యం శ్రీను, చిక్కాల దొరబాబు, మిరియాల సాయి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వీర మహిళలు పాల్గొన్నారు.