జనంకోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం: రాజానగరం మండలం, రఘునాధపురం గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. రాష్ట్రము సుబిక్షంగా ఉండాలంటే ఈ దుష్ట పరిపాలన నుండి విముక్తి చెందాలని దానికోసం మనమందరం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని అఖండ మెజారిటీ తో గెలిపించాలని జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, పోకెట్ బ్యాడ్జ్ అందివ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.