సింగవరంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • సింగవరం గ్రామంలో ఉదృతంగా సాగిన పాదయాత్ర
  • యువ నాయకులు తోట పవన్ కుమార్ కు హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

రాజానగరం: సీతానగరం మండలం సింగవరం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ అల్లుడు యువజన నాయకుడు తోట పవన్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ వారి కష్టాలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించుకుని మన జీవితాలలో వెలుగులు నింపుకుందాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.