జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • బత్తుల వెంకటలక్ష్మికి బ్రహ్మరధం పట్టిన నరసాపురం గ్రామ ప్రజలు
  • మూడవ రోజు ఉదృతంగా కొనసాగిన పాదయాత్ర
  • రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగిన పాదయాత్ర
  • హారతులతో స్వాగతం పలికిన నరసాపురం గ్రామ ఆడపడుచులు

రాజానగరం: కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి బత్తుల బలరామకృష్ణని గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేద్దాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేసిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.