జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • రాధేయపాలెం గ్రామంలో రెపరెపలాడిన జనసేన జెండా
  • భారీగా తరలివచ్చిన జనసేన పార్టీ శ్రేణులు
  • పాదయాత్రలో బత్తుల కుటుంబానికి బ్రహ్మరధం పట్టిన ప్రజానీకం
  • ముందుగా గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రాధేయపాలెం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి బత్తుల బలరామకృష్ణని గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేద్దాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేసిన జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్, నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు వీరమహిళా సాధికార కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవి, వందనాంబిక. అనంతరం రాధేయపాలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకులతో కలిసి జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ “జెండా ఆవిష్కరణ” చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనశ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.