చిన్నకొండేపూడి గ్రామంలో “జనం కోసం జనసేన మహాపాదయాత్ర”
- బత్తులకు బ్రహ్మరధం పట్టిన గ్రామ ప్రజలు
- తీన్మార్ డప్పులు, హారతులతో అడుగుఅడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం..
- రోజు రోజుకీ బత్తుల కుటుంబంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ..
రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ గారిచే గురువారం “జనం కోసం జనసేన మహాపాదయాత్ర” సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో జరిగింది. బత్తుల బలరామకృష్ణ గారితో పాటు వారి కుమార్తె వందనాంబిక పాదయాత్రలో పాల్గొని గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తెచ్చుకుందాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-12-at-10.45.01-AM-1024x576.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-12-at-10.45.02-AM-1024x576.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-12-at-10.44.59-AM-1024x576.jpeg)