రంగయ్యనాయుడు స్ట్రీట్ లో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో ఆదివారం 31వ డివిజన్ రంగయ్యనాయుడు స్ట్రీట్ లో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో జరిగినది. ఈ పాంతంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు పర్యటిస్తూ యాత్రని చేపట్టారు. ఈయాత్రలో పాలొన్న మెయినుద్దీన్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముస్లిం వర్గాలకు అది చేసాం ఇది చేస్తున్నాం, అని ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతుంటాడనీ అవి విన్న జనాలు హమ్మో యెన్నిచేస్తున్నాడో అని ఆశ్చర్యపోయారనీ నిజానికి అవన్నీ మబ్బుల్లో నీళ్ళన్నారు. ఈ ముఖ్యమంత్రి మాటల్లో కోటలు కట్టడం తప్ప వాస్తవానికి ఏమీ ఉండవని ముస్లిం ప్రజలు వాపోతున్నారన్నారు. జనసేన పార్టీ ముస్లిం వర్గాల ప్రయోజనాలని కాపాడతాదని చెపుతూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశంల ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, పఠాన్ ఖాన్, బషీర్, ఎస్.కె ఇమామ్, ఎం.డి జాఫర్, కరీమున్నిసా, నజీనా, నసీమా, తాహెరా, బాద్షా, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.