జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు కందులను కలిసిన కొమ్ముల

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నగరం ఏ.ఎమ్.సి మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రాజమహేంద్రవరంలో మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్, మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు, మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు జాలెం శ్రీనివాసరావు, నాయకులు కొమ్ముల జంగమయ్య, కంకిపాటి నరసింహరావు, మంద గాంధీ, తుండూరు బుజ్జి, వేగి పండు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.