వైభవంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దర్శి: జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శి అద్దంకి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దిరిశాల ఏసురెడ్డి, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబెర్ పసుపులేటి చిరంజీవి, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబెర్ పుప్పాల రుద్రా, ఐ టి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, దర్శి టౌన్ ప్రెసిడెంట్ చాతిరసి కొండయ్య, ముండ్లమూరు మండల ప్రెసిడెంట్ తోట రామారావు, కురిచేడు మండల ప్రెసిడెంట్ శేషయ్య, తాళ్లూరు మండల ప్రెసిడెంట్ కూతలా ప్రసాద్, దొనకొండ మండల ప్రెసిడెంట్ గుండాల నాగేంద్ర ప్రసాద్, దర్శి మండల ప్రెసిడెంట్ పుప్పాల భూలక్ష్మి, పుప్పాల పాపారావు, దొనకొండ టౌన్ ప్రెసిడెంట్ షఫీయుల్లాఖాన్, జనసైనికులు, వీరమహిళలు, జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *