మహిళా సాధికారత కోసం జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుంది – లోకం మాధవి

నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న మహిళల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడిన లోకం మాధవి, మాధవి మాట్లాడుతూ మిగతా పార్టీలలా జనసేన పార్టీ హామీలు ఇచ్చి పబ్బం గడిపే పార్టీ కాదు అని ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలుచేసి తీరుతుంది అని, ఈరోజు ప్రజలు అంటే ఎంతో గౌరవం మరియు నిబద్దత కలిగి ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ స్థాపకి కృషి చేయాలని అక్కడ ఉన్న ప్రజలను లోకం మాధవి కోరారు. అలాగే జనసేన మేనిఫెస్టోలో మహిళల కోసం వారి అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలని వారికి తెలిపారు. వారి ఊరి సమస్యలు అడుగుతుండగా అక్కడ ఉన్న మహిళ తను వితంతువు అయినా ఇప్పటికి తనకి పెన్షన్ రాలేదని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. సమస్య విన్న మాధవి ఆమె తరపున పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. రాజకీయాలలోకి రావటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు మరియు ప్రజలకి ఈ ప్రాంతానికి మంచి చేయాలి అన్న తపనేనని ఈసారి వచ్చే ఎన్నికల్లో జనసేనకి మద్దతు తెలియజేయాలని కోరారు.