రైతులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుంది

శృంగవరపుకోట, మిచౌంగ్ తుఫాన్ కారణంగా లక్కవరపుకోట మండలంలో చాలా పంట నష్టం జరిగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి సపోర్ట్ లేదని రైతులు చెప్పడం జరిగింది. అలాగే అకాల వర్షం వల్ల చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు చెప్పడం జరిగింది. అలాగే మాతో పాటు లక్కవరపుకోట గ్రామ వ్యవసాయ సహాయకులు మనోజ్ వివరించి అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఎం.ఎస్.ఎస్కే స్వాతి కుమారికి ఫోన్ చేసి రైతులకు జరిగిన పంట నష్టం గురించి వివరించడం జరిగింది. లక్కవరపుకోట మండల నాయకులు షేక్ .ఫిరోజ్ రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ రైతులకు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు రైతుల కోసం జనసేన పార్టీ చాలా చేసింది. అందులో భాగంగా కౌలు రైతులకు 30 కోట్లు రూపాయలు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు కష్టార్జితం ఇవ్వడం జరిగిందని రైతులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు దేవా, ఇస్మాయిల్, పరమేష్ రఘు, సంతోష్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.