జనసైనికులే జనసేన పార్టీ బలం: మేడ
రాజానగరం: జనసేన జనజాగృతి యత్ర 46వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో 2వ రోజు హరిజన పేటలో మంగళవారం కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 43,300 వేల గాజు గ్లాసులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మండపాక శ్రీను అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది.. కార్యక్రమంలో బాఘంగా గ్రామ గ్రామాన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రంలు ప్రజలకు అందిస్తూ… జనసేన పార్టీని కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, తన్నీరు తాతాజీ, అడపా అంజి బాబు, పోసిబాబు, చదువు ముక్తేశ్వరరావు, చల్లా ప్రసాద్, పేమ్మడా సతీష్, కొచ్చర్ల భరత్, కొచ్చర్ల బాబి, మండపాక మురళి మరియు గ్రామ జనసేన నాయకులు జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీగా పోటీ చేసిన పొట్నూరి అచ్చియమ్మ, డి.ఎం రాజు, డి. పోతిబాబు, పొట్నూరి అప్పన్న, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-10.06.48-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-10.06.49-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-31-at-10.06.50-PM-1024x576.jpeg)