జనసేన పార్టీ ముద్దు బిడ్డ గురుదత్ కు జన నిరాజనం..
రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 41వ రోజు కార్యక్రమంలో భాగంగా పార్టీ ఎన్నికల గుర్తు అయి గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం పశ్చిమ గోనుగూడెం గ్రామంలో జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా 1000 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 41,000 గాజు గ్లాసులు పంపిణీ కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆడపడుచు &జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి సహకారంతో గ్రామ గ్రామన ప్రతి సమస్యను సేకరిస్తూ, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రంలు ప్రజలకు అందిస్తూ… జనసేన పార్టీ ని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, తెలగంశెట్టి శివ, పశ్చిమ గోనగూడెం గ్రామ కమిటీ మెంబర్స్ బొజంకి రాజు, గోళ్ళ సాయి, వీరపురాజు పోసిబాబు, రాచపోతుల సురేష్, గోళ్ళ కృష్ణ, చొంగ పవన్ కుమార్, కోమలి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-21-at-9.27.13-PM-1024x821.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-21-at-9.27.14-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-21-at-9.27.15-PM-1024x576.jpeg)