జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి..!

మార్చి 14న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోయే ఝనశెన ఫర్త్య్ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని.జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరు శంకర్ గౌడ్, కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆదేశాల మేరకు గురువారం పాల్వంచ మండల కేంద్రంలో ఆవిర్భావ సభకు సంబంధించి హలో పాల్వంచ.. ఛలో పిఠాపురం పోస్టర్ ను ఆవిష్కరణ చేయడంజరిగింది. అనంతరం పాల్వంచ మండల అధ్యక్షులు కొండ దేవా గౌడ్ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల బ్రహ్మం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ రోజు రోజుకు బలోపేతం అవుతుందని అన్నారు.ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం సైనికుల లాగా పని చేసేందుకు ఎప్పుడు ముందుంటారని అన్నారు. 14న జరిగే సభకు పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు మెగా అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం అధ్యక్షులు కొండ దేవా గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల బ్రహ్మం, మెగా ఫ్యాన్స్ అద్యక్షుడు ఖాసిం, భాస్కర్, బాలాజీ, సాయి తేజ్, ప్రసాద్, నాని తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment