విలక్షణ నటుడికి జనసేన ఘన నివాళి

విజయవాడ, విశిష్ట నటనతో ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఎస్వీ రంగారావు జయంతిని జనసేన పార్టీ ఘనంగా జరిపింది. పార్టీ నాయకురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో జయంతి వేడుకలు జరుగగా, ఆయన చిత్రపటానికి జనసైనికులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ, ‘‘మాయాబజార్‌లో ఘటోత్కచుడు, నర్తనశాలలో కీచకుడు, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు పాత్రలతో తెలుగు నటనకు దిక్సూచి అయ్యారు ఎస్వీ రంగారావు. ఆయన నటన, తెలుగు సాహిత్యం, నాటక రంగానికి చేసిన సేవలు స్మరణీయంగా ఉంటాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, ఐటీ కోఆర్డినేటర్ మంతాపురం రాజేష్, డివిజన్ నాయకులు శ్యాంసుందర్, ఆదిత్య రెడ్డి, అర్జా మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.

Share this content:

Post Comment