జనసేన పెదబయలు మండలస్థాయి సమావేశం
అరకు నియోజకవర్గం, అల్లూరిసీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం అరడకోట పంచాయితీ లింమగుంట గ్రామంలో సందర్శించిన పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ లిమగుంట గ్రామస్తులతో సమావేశమైన పవన్ కుమార్ గ్రామస్తులు తెలిపిన సమస్యలు మంచినీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్డు రవాణా, అంగన్వాడీ భవనం కొరత వంటి పలు సమస్యలు గ్రామస్తులు తెలిపారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలో అష్టకష్టాలకు గురౌతున్న గిరిజనులు త్వరలోనే వైసీపీ పార్టీ కి తగిన బుద్ధి చెప్తారని, మీరందరు జనసేనపార్టీ కి సపోర్ట్ చేసి జనసేన ప్రభుత్వం స్థాపించడానికి మీ వంతు కృషి మీరు చేయాలని పిలుపునిచ్చారు. మన ప్రాంతంలో ఎందరో పట్టాలు పుచ్చుకుని నిరుద్యోగులుగా ఉన్నారని ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు దారుణ మోసం చేస్తున్నారని ఈ విషయంలో యువత మార్పు కొరకు పాటు పడే రాజకీయలవైపుగా ఆలోచన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చేరుకున్న సుమారు 30 మంది యువత గతంలో వైసీపీ పార్టీ గెలుపు కోసం చాలా శ్రమించమని కానీ మోసపోయామని ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలో లేకున్నా కూడా తమవంతు బాధ్యతగా పేద ప్రజలకోసం, రైతుల కోసం తమ వంతు సహాయంగా నిలబడి సాయం చేస్తున్నారని, ఈ విషయం మమ్మల్ని ఆకర్శించిందని ఇలాంటి వ్యక్తికి మనమందరు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ముక్తకంఠంతో లిమగుంట యువత తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులతో పాటు జనసైనికులు బాబూరావు, అప్పారావు, సన్నిబాబు, రాంబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/li-1024x576.jpg)