ప్రజా సమస్యలపై జనసేన ప్రజాసంఘటిత యాత్ర
రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు మండలం, తిమ్మిశెట్టిపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజాసంఘటిత యాత్రలో భాగంగా తిమ్మిశెట్టిపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో పర్యటించడం జరిగినది.. పర్యటనలో భాగంగా గ్రామ వాస్తవ్యులైన శంకరయ్య తదితరుల గ్రామస్తులతో పార్టీ విధి విధానాలపైన చర్చించి, రాబోయే ఎన్నికలలో విజయం సాధించే విధంగా గ్రామస్తులతో అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సాయం శ్రీధర్, ఎద్దల అనంతరాయలు, చవాకుల రెడ్డిమని, నల్లంశెట్టి కిషోర్, పగడాల రఘు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-8.22.36-PM-1024x461.jpeg)