ఖమ్మంలో జనసేన సత్తా చూపించాలి: రామకృష్ణ మిరియాల

తెలంగాణ, ఖమ్మం అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జి రామకృష్ణ మిరియాల క్రియాశీలక కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క కార్యకర్త జనసేన సిద్ధాంతాలను విధానాలను ప్రజల దగ్గరికి చేరుస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేనకి ఓటు వేసేలా ప్రభావితం చేయాలి అని తెలిపారు. ఈ సందర్భంగా 5 లక్షల జీవిత భీమా, 50 వేల ప్రమాద భీమాతో కూడిన సభ్యత్వ కిట్లను క్రియాశీలక కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షులు మెడబోయిన కార్తిక్, ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ,ఉపాధ్యక్షులు దేవేందర్, ఉత్తమ్ రాజు, హసీనా, మహిళ జిల్లా అధ్యక్షురాలు భోగ హరిప్రియ, నగర అధ్యక్షురాలు విజయ కుమారి, విద్యార్థి విభాగం అధ్యక్షులు గంగాధర్ ప్రధాన కార్యదర్శి రాకేష్ చారి నగర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాణాల శ్రీకాంత్, రమణ కుమార్, గుండ్ల పవన్ కళ్యాణ్ సెక్రెటరీ కడియాల నరసింహారావు, ఉపేందర్, ఫయాజ్, రచ్చ నాగరాజు కార్యవర్గ సభ్యులు నరేష్, శ్రీనివాస్, నూనె శ్రీకాంత్ విద్యార్థి విభాగం సెక్రటరీ అక్కిరాల సాయి కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.