ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర

ఏలూరు: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా శనివారం 17వ డివిజన్ పడమర వీధిలోని గాంధీ మైదానం వద్ద నుండి జనసేన పోరుబాట పాదయాత్ర కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, మేకా సాయి, వంశీ మరియు జనసేన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప లోనూ ప్రజలు తమ యొక్క ఆవేదనను మాకు తెలియజేస్తున్నారని అన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేవారని, ఈ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లను ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం చెత్త ఆలోచన చేసి చెత్తపై పన్నును వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లును విపరీతంగా పెంచి వేశారు. ఏదైనా పనిచేద్దామంటే ఉపాధి లేదు, మా పిల్లలకు మంచి చదువున్న ఇక్కడ ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నామని ఎప్పుడు ఎలక్షన్లో వస్తాయో ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క గడప తొక్కుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన ప్రభుత్వాన్ని చూడాలని ఆ ఒక్క ఆలోచనతో అందరూ ఉన్నారని రేపు రాబోయే రోజుల్లో కచ్చితంగా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆయన తెలియజేశారు. కుంటు సాకులు చెప్పే కరెంటు బిల్లు పెంచుతున్నారని ఈ దుర్మార్గపు పాలనను ఇకనైనా అంతమొందిస్తామని ఇప్పటికీ గెలిచిన శాసనసభ్యులు ఎక్కడ కనిపించట్లేదు అని వచ్చి పెళ్లి సంబరాలు చేసుకుని అట్టహాసంగా ఊరేగింపుగా వెళ్తున్నారే తప్ప ప్రజల సమస్యలు ఇతనికి కనిపించట్లేదని నియోజకవర్గ ప్రజలు ఇతన్ని ప్రశ్నిస్తున్నారు?. ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ?. ఏలూరు నియోజకవర్గంలో గాని, ఈ రాష్ట్రంలో గాని జనసేన పార్టీ జనసైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, సరళ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నాయకులు సాయి, వంశీ, రాజు, భాను, పత్తి రాజా, బొద్దాపు గోవిందు, వీరంకి పండు, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, జంగం కృపానందం, భూపతి ప్రసాద్ 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, ప్రమీల రాణి, బీబీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.