పారిశుధ్య కార్మికుల నిరసన దీక్షకు జనసేన మద్దతు

విశాఖ దక్షిణ నియోజకవర్గం: పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, వార్డ్ ప్రెసిడెంట్ తో కలిసి సంఘీభావం తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బిశెట్టి వసంతలక్ష్మి, మహమ్మద్ సాదిక్, వార్డ్ ప్రెసిడెంట్లు అంగటి శ్రావణ్, గరికిన రవి, మైలపల్లి చిన్న, లంకా త్రినాథ్, రూప, నీలం రాజు, తెలుగు అర్జున్ తదితరులు పాల్గొనడం జరిగినది.