సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

  • తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కాంట్రాక్ట్ కార్మికులసమ్మె విజయవంతం

తిరుమల తిరుపతి దేవస్థానం కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకోగా వారి సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపి వారికి ఆదివారం మధ్యాహ్నం జనసేన పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నదానం ఏర్పాటు చేయటం జరిగింది. కార్మికుల సమ్మెకు ఈఓ ధర్మారెడ్డి ఒక మెట్టు దిగి ఈ పోరాటంలో కచ్చితంగా ఈ ఎస్ ఐ, పిఎఫ్, జీతాలు, నాలుగు రోజుల సెలవు, లడ్డు, దర్శనంతో పాటు 9000 జీతం ఇస్తాము అని చెప్పటం జరిగింది. కచ్చితంగా ఈరోజు ఈ కార్మికుల వైపు పూర్తి న్యాయం జరగకపోయినా పూర్తి న్యాయం జరిగే వరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఎప్పుడు అండగా ఉంటామని కార్మికులకు హామీ ఇవ్వటం జరిగింది. వీరికి కార్పొరేషన్, జీతం రూ.18000/- ఇచ్చేవరకు జనసేన పార్టీ కార్మికులతో కలిసి పోరాటం చేస్తుందని చెప్పారు. మీరు పోరాటంలో ఉంటే మీతో జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బత్తిన మధుబాబు, రాష్ట్ర అధికారప్రతినిధి కీర్తన, జిల్లా కార్యదర్సులు ఆనంద్, బాటసారి, తిరుపతి పట్టణ కార్యదర్శులు కిరణ్ కుమార్, రవి, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.