జనసేన, టీడీపీ పొత్తుతో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం: గర్భాన

పాలకొండ నియోజకవర్గం: జనసేన, టిడిపి పార్టీల పొత్తులు సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తాయని తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కట్టుబడి ఉంటాం అని అన్నారు. తను ఒక అభిమానిగా ఒక జనసైనుకుడుగా నా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవించి ఆచరిస్తాను. నా చివరి క్షణం వరకు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే నడుస్తూ నాచివరి శ్వాస వరకు జనసేన పార్టీ కోసమే పనిచేస్తానని తెలియచేశారు. జనసేన టిడిపి పొత్తుకి కారణం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అని అందుకే ఈ పొత్తుకు సిద్ధం అయ్యారు అని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జనసేన పార్టీ కి సంబందించిన ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పని చేయాలనీ పిలుపునిచ్చారు.