తుఫాను బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని జనసేన-టిడిపి ధర్నా

పి.గన్నవరం, తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు మరియు కౌలు రైతుల పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు శుక్రవారం మామిడికుదురు మండల తాసిల్దారు ఆఫీసు ఎదుట ధర్నా చేయడం జరిగింది. రైతులు చేస్తున్న ఈ ధర్నాకి మామిడికుదురు మండల జనసేన మరియు టిడిపి తరపున రైతులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మామిడికుదురు మండలం అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, పాశర్లపూడి లంక ఎంపిటిస్ చెరుకూరి పార్వతీ సత్తిబాబు, పాశర్లపూడి ఉప సర్పంచ్ తుండూరు బుజ్జి, అప్పనాపల్లి సీనియర్ నాయకులు కంకిపాటి నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి మంద గాంధీ, కార్యదర్శులు అడబాల చిన్ని, కాట్రేనిపాడు నాగేంద్ర, ఇంజే రవి మరియు ఎరుబండి చిన్ని, మామిడికుదురు మండల జనసేన మైనార్టీ నాయకులు సర్కిల్ రజా అలీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.