జనసేన-టిడిపి ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీ మార్కెట్ యార్డులో వారపు సంత సందర్భంగా జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జనసేన-టిడిపి ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వ్యాపారులందరూ కలిసి గిట్టుబాటు ధర, మున్సిపల్ కాంప్లెక్స్ కావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అమిలినేని సురేంద్రబాబు గారి కుటుంబ సభ్యులు స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర కల్పిస్తూ, దినసరి సంత కోసం మున్సిపల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున వీరమహిళలు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు గంగరాజు, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్, చిత్తప్ప, సుధాకర్ మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.