జనం వద్దకు జనసేన.. జనంకోసం జనసేన

విజయనగరం: ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న జనం వద్దకు జనసేన.. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆదేశాల మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన “ఫిర్యాదుల స్వీకరణ కౌంటర్” వద్ద ప్రభుత్వ బాధితుల తరుపునుంచి అనూహ్య స్పందన వచ్చింది. వారి దగ్గర నుండి కొన్ని వినతులు, అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మోపడ అనిల్ కుమార్, దాసరి యోగేష్ , కొర్నాన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.