అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన వినతి

ఏలూరు, కొల్లేరులో అక్రమ తవ్వకాల కారణంగానే ఈ నెల 1వ తారీఖున దెందులూరు నియోజకవర్గం, మాదేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మరణించారని కావున ఈ అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై, వారికి సహకరించిన అటవీశాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవరం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ కి జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జనసేన నాయకులు కొఠారి అదిశేషు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు ఉప్పు కల్కి రమేష్, బొడ్డు గిరిబాబు కలిసి వినతిపత్రం అందించడం జరిగింది.