జనసేనాని పుట్టినరోజు వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా గురువారం పత్తికొండలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మీ సి జి రాజశేఖర్ కోరడం జరిగింది. సెప్టెంబర్2 వ తేదీన మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పత్తికొండ టౌన్ నందు గురువారం ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ముఖ్యంగా సెప్టెంబర్ 2 వ తేదీన గణేష్ నిమజ్జనం ఉన్నందువల్ల రక్తదాన శిబిరం ప్రోగ్రామ్ ను సెప్టెంబర్ 1వ తేదీనే ఏర్పాటు చేయటం జరుగుతుందని కావున ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని అలాగే మీ ఫ్రెండ్స్ కు మరియు ఆసక్తి గల వారిని బ్లడ్ ను డొనేట్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నామని సి జి రాజశేఖర్ తేలియ జేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-31-at-9.41.02-PM-1-1024x546.jpeg)