ఆంధ్రరాష్ట్ర ప్రజల సంక్షేమం, భావితరాల భవిష్యత్తే జనసేన లక్ష్యం: యం.ధనుంజయ.

గుంతకల్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమేనని, జనసేన నాయకుడు తీసుకునే ఎటువంటి నిర్ణయానైనా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కచ్చితంగా స్వాగతిస్తూ ఆయన ఆశయాల కోసం తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపు కోసం బలంగా పోరాడుతాం ధైర్యంగా ముందుకెళ్తామని, రాష్ట్రంలో రౌడీయిజం, గుండాయిజం, పెరుగుతోందని ప్రశ్నించిన వారిపై దాడులు, బెదిరింపులు, పోలీసులతో అరెస్టులు చేయిస్తూ జగన్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, రానున్న రోజుల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్దేదించేందుకు ఖచ్చితంగా బిజెపి, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతిపక్షాల ఐక్యతతో మాత్రమే సాధ్యమని ధనుంజయ పేర్కొన్నారు.