ధవళేశ్వరం మెరక వీధిలో జనచైతన్య శంఖారావం

రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం మెరక వీధిలో జనచైతన్య శంఖారావం అశేష జన వాహిని నడుమ ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దుర్గేష్ కి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ ఇళ్ల నిర్మానంలో ఎదుర్కొంటున్న సమస్యలు మొదలగు వాటి గురించి వివరించడం జరిగింది. దుర్గేష్ మాట్లాడుతూ మేము మీ సమస్యలను తెలుసుకుని అధికారుల మీదకి ఒత్తిడి తీసుకొచ్చి మీ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ సమస్యలు అధికార పార్టీ వారు తీర్చలేని పక్షంలో త్వరలో వచ్చే అధికారం జనసేన పార్టీదే అప్పుడు కచ్చితంగా మీ సమస్యలను నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.కె.సులేమాన్, యడ్ల మహేష్, యడ్ల వెంకటేష్, నరుకుల రాజు, ప్రసాదులు వాసు, కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, శివారెడ్డి, సురపురెడ్డి శ్రీరామ్ శివాజీ, సురాడ సత్తిబాబు, అవాల శివ, పుష్ప దిండి జగదీశ్, సింగరెడ్డి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.