మురికిగుంటగా జనగామ: ఆలేటి నరేందర్

జనగామ, శుక్రవారం కురిసిన వర్షానికి జనగామ జలమయమైంది. మూడు గంటలకు పైగా కురిసిన వర్షానికి జనగామ చౌరస్తాలో పాదాలపై వరకు వర్షపు నీరు నిలిచాయి. అదే విధంగా జనగామ హైదరాబాదు రోడ్డులో మోకాళ్ళపైకి వర్షపు నీరు చేరడం జరిగింది. బైకు చక్రాలు మునిగిపోతుండడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్నటువంటి వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండు సంవత్సరాలుగా వర్షాలు పడినప్పుడల్లా మోకాళ్ళపైకి నీరు నిలుస్తుండడంతో దీన్ని పట్టించుకొని అధికారులు ఇప్పటికి వరకు మరమ్మత్తులు చేయించలేదు. వెంటనే అధికారులు పట్టించుకొని మరమ్మత్తులు చేయించాలని జనసేన పార్టీ వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంద.నాగరాజు, జాని బొట్ట రాకేష్, క్రాంతి, వెంకట్, పవన్, గుడేపు విజయ్, నాగరాజు పాల్గొన్నారు.