జనంలోకి జనసేన.. పాత నవరసపురంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర
జనంలోకి జనసేన 4వ రోజు
నరసాపురం: జనంలోకి జనసేన 4వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం, పాత నవరసపురం గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి, వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, ఫాఛ్ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ శ్రీ బొమ్మడి నాయకర్ భరోసా ఇచ్చారు. ఆ గ్రామంలో ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అలాగే అది లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల వరదలు వచ్చినప్పుడు గ్రామం మొత్తం మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు మరియు ఇళ్ళ స్థలాల భూములు చెరువులుగా ఉన్న భూములను కేటాయించారు దాని వల్ల ఇల్లు కట్టుకోడానికి ఇబ్బంది అని ఆ గ్రామ ప్రజలు తెలిపారు అని నాయకర్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, కొల్లాటి గోపీకృష్ణ, గుబ్బల మార్రజు, అయితం చిన్ని, లక్కు బాబి, అడ్డాల సత్యనారాయణ, ఆదిమూలం వెంకటేశ్వరరావు, అడ్డాల బాబి, దేవరపు బాబి, ఆదిమూలం రాజేష్, ఆదిమూలం వెంకట నరేంద్ర, తిరుమాని బాలకృష్ణ, కారాడి సురేష్, తిరుమాని పూర్ణ చంద్రరావు, నారిన వెంకటేష్ అలాగే నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు పాత నవరసపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-29-at-9.45.55-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-29-at-9.45.54-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-29-at-9.45.53-PM.jpeg)