జనంలోకి జనసేన – గర్భన సత్తిబాబు

పాలకొండ, పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు గడప గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మేనిఫేస్టో వివరించడం జరిగింది. అలానే గ్రామంలో పలు సమస్యలను తెలుసుకొని అధికార, ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలని ప్రజలకు తెలియచేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేసి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జనసేన పార్టీ తోనే వెనుకబడిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని రేపటి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.