విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన – జనంకోసం జనసేన
తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని 29వ వార్డు నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన.. జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ.. తణుకు మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడం వలన అభివృద్ధి కుంటుపడిందని, ఏ వార్డులో చూసిన పారిశుధ్యం లేదని మౌల్డ్ సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ అసలే బాగోలేదని, జగన్ మోహన్ రెడ్డి దయవల్ల చెత్త పన్ను పెరిగిందని పన్నుల భారం పెరిగిందని, త్వరలో తణుకు మున్సిపాలిటీలో జనసేన పాలకవర్గం ఏర్పడుతుందని, తణుకు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామనివిడివాడ రామచంద్ర రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, తణుకు టౌన్ యూత్ అధ్యక్షులు గర్రెతులసీరామ్, తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు చిక్కాల వేణు, 29వ వార్డు జనసేన పార్టీ నాయకులు సుంకర ప్రసాదు, కొక్కిరిమెట్టి సత్తిబాబు, ఎల్లమిల్లి సత్యనారాయణ, మండపాక గ్రామం ఎంపీటీసీ వేల్పూరి శ్రీనివాస్, టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ తామరపు నరసింహారావు, కురసాల శ్రీనివాస్, జవ్వాది ప్రసాదు, శివటం శీను, వీరమహిళలు కొమ్మిరెడ్డి సూర్య కుమారి, సునీత ఎండ్రా, రత్న జ్యోతి, కామవరపు రూప మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-19-at-6.54.32-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-19-at-6.54.32-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-19-at-6.54.33-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-19-at-6.54.31-PM-1-1024x576.jpeg)