జననేత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన గుడివాడ పట్టణ జనసైనికులు

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో భారీ కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ నీతి నిబద్ధత అనే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అని, మహోన్నత నేతకు మేమందరం కార్యకర్తలు అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఎవరైనా నాయకులు పుట్టినరోజులు అంటే బైక్ ర్యాలీలు, పెద్ద పెద్ద బ్యానర్లతో ప్రజలకి ఇబ్బందికరంగా హడావుడి చేస్తారని, కానీ మా నాయకుడు నా జన్మదినం వేడుకలకు ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందజేయాలని రక్తదానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాంటి నాయకుడి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప గంటా అంజి, దివిలి సురేష్ చరణ్ తేజ్, నాగసాయి,కిరణ్, వీర మహిళ అరుణ మరియు కార్తీక్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు.