శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో జనంతో జనసేన – ప్రజా బాట

తెలంగాణ, నర్సంపేట, నెక్కొండ మండల కేంద్రంలో “జనంతో జనసేన – ప్రజా బాట” కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జ్ మెరుగు శివకోటి యాదవ్ శ్రీకారం చుట్టడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గంలో పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలో అధ్యక్షులు ఉడుగుల క్రాంతి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సంపేట నియోజవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ పాల్గొని ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను, తమ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నియోజవర్గంలో చేసినటువంటి ప్రజాసేవ, పోరాట కార్యక్రమాలను వివరించి, జనసేన పార్టీ సామాన్యుల కోసం పుట్టిందని,సామాన్యులకు అండగా ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓర్సు రాజేందర్, ఎలబోయిన డేవిడ్ రాజ్, రోడ్డ శ్రీకాంత్, బొబ్బ పృథ్వీరాజ్, గద్దల కిరణ్, టేకుల రవి, రణదీప్, అభిషేక్, రవి కిరణ్, అరుణ్ హర్షవర్ధన్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.