గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, చినపలకలూరు గ్రామంలో ఆర్చీ బజారులో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చి ఇంటి వద్దకు నీళ్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ మా గ్రామ అభివృద్ధి మరియు సేవ చేయడమే మా లక్ష్యం, మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాకు ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, మండల కార్యదర్శులు గణితి ధనసాయి కుమార్, బొందలపాటి సాంబశివరావు, గ్రామ అధ్యక్షులు తుమ్మల ఏడుకొండలు, గ్రామ జనసేన నాయకులు తుమ్మల సురేష్ కుమార్, పాలపాటి శేఖర్, వాసా యాలాద్రి, డబ్బూరి రామచంద్రయ్య, ఆలా దాసు తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment