రాష్ట్రం నలుమూలల నుండి తరలివస్తున్న జనసైనికులు

మంగళగిరి, ఇప్పటం గ్రామంలో సాయంత్రం 3 గంటలకు జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి జనసైనికులు చేరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల నుండి సభ కొరకు జనసేన నాయకులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన బస్సులు చేరుకుంటున్నాయి.

కార్లలోను, బైక్ ల మీద కూడా అధిక సంఖ్యలో జనం సభా స్థలికి చేరుకుంటున్నారు. తెలంగాణ నుండి కూడా అధిక సంఖ్యలో జనసైనుకులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సభ కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తవ్వగా, సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జనసేన నాయకులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.