పలు సమస్యలపై జనసైనికుల నిరసన

పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ మండలం, సిద్దాంతం కేదార్ ఘాట్ ఇసుక ర్యాంప్ టోల్ వద్ద జన సైనికులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
భాగంగా.. జనసైనికులు ఆ ప్రాంతంలో ఉన్న పలు సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు.

ఇసుక లారీలను అడ్డుకున్న జన సైనికులు.. దేవస్థానం టోల్ గేట్ పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

లారీల వద్ద నుండి టోల్ పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతూ.. బురదమయం, గుంతలతో ఉన్న రోడ్లులను పూడ్చడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దారి గుండ స్మశానవాటికకు అంతిమయాత్రకు వెళ్ళడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా.. అధికారుల అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దీని పై అధికారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం అని జనసైనికులు హెచ్చరించారు.