కళ్యాణ్ దిలీప్ సుంకరతో పాయకరావుపేట జనసేన నాయకులు మరియు జనసైనికులు
విశాఖపట్నం, ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, జనసేన పార్టీ కీలక మద్ధతుదారుడు సుంకర కళ్యాణ్ దిలీప్ ని గురువారం విశాఖలో పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు మర్యాద పూర్వకంగా కలిసి అత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై వాకబు చేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలిసుకున్నారు. జనసైనికులంతా సమైక్యంగా పాటుపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలంతా పవన్ కళ్యాణ్ వెంట నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము, తుమ్మలపల్లి స్వామినాధ్, జ్యోతికుమార్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-02-at-6.22.21-PM-1024x768.jpeg)