జనసైనికుడు క్రాంతి కుటుంబానికి అండగా జనసేన

పోలవరం: జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు గ్రామంలో గత 3రోజుల క్రితం వచ్చిన తుఫాన్ కారణంగా జనసైనికుడు క్రాంతి మరియు సీత దంపతులు నివాసం ఉండే పాక కూలి ధ్వంసం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు స్పందించి, కార్యకర్తలు జనసైనికులతో కలిసి వారిని పరామర్శించారు. వారి కుటుంబానికి జరిగిన ఆర్ధిక నష్టానికి తమ వంతు ఆర్థిక సహాయంగా చిర్రి బాలరాజు 5,500/-రూపాయలు అందజేశారు. జనసేన తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాంపండు, పూనెం రఘు, కాకా లక్ష్మణరావు, కోర్స ముత్యాలరావు, పండు రాము మరియు జనసైనికులు పాల్గొన్నారు.