ఏటుకూరు గ్రామం నుంచి జనసైనికుడి పాదయాత్ర
గుంటూరు జిల్లా, ఏటుకూరు గ్రామ జనసైనికుడు ఎన్.వి రమణ పాదయాత్రగా హైదరాబాద్ కు బయలుదేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వాలని మార్గమధ్యలో ఉన్న ప్రతి దేవాలయాలను సందర్శించి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు చేయించి కాలినడకగా పెనుగంచిప్రోలు జనసేన సైనికులు స్వాగతం పలకడం జరిగింది. ఆనతరం శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి పవన్ కళ్యాణ్ ని కిరాయి రౌడీల నుంచి కాపాడాలని, ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ పెనుగంచిప్రోలు ముక్కుపేట చిలకలు మీదుగా హైదరాబాద్ బయలుదేరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-07-at-10.24.11-1024x576.jpeg)