*కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ టి.వి. రామారావు
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మోటార్ సైకిల్ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన ఐ. పంగిడి జనసైనికుడు సిమకుర్తి విజయ్ను మంగళవారం కలిసి, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించిన కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ టి.వి. రామారావు, జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు కొప్పాక విజయ్ కుమార్, టౌన్ అధ్యక్షులు డేగల రాము, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ ప్రభాత్ తదితరులు ఆసుపత్రికి వెళ్లారు. అలాగే, మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరుగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభాస్థలిని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని నాయకులను ఆదేశించారు. సభకు వచ్చే జనసైనికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమీక్షించారు.
Share this content:
Post Comment