విశాఖ ఘటనను ఖండించిన కంచికచర్ల మండల జనసైనికులు

  • జనాకర్షణ ఓర్వలేకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది నాయిని సతీష్
  • సహించాం, భరించాం, తెగిస్తాం: జనసైనికులు

కంచికచర్ల పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయిని సతీష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆదివారం ఏర్పాటుచేసిన జనవాణి కార్యక్రమాన్ని ఓర్వలేక మంత్రులు ఎమ్మెల్యేలు, కక్షపూర్వకంగా వ్యవహరించారని దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. అప్పటికప్పుడు నిర్ణయించిన కార్యక్రమం కాదు దాదాపు మూడు నాలుగు నెలల నుంచి జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేద్దామని పార్టీ నిర్ణయించడం జరిగిందని విశాఖపట్నంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి వచ్చిన ప్రజాదరణ ప్రజాకర్షణ ఓర్వలేక తట్టుకోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్యంలో ఇటువంటి తగ్గింపు చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే అక్కడ మంత్రులు మాటలతోటాలు పేల్చిన జనసైనికులు క్రమశిక్షణతో ఉన్నారని జన సైనికుల సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు తోట ఓంకార్, మండల ప్రధాన కార్యదర్శి దేవి రెడ్డి అజయ్, కార్యదర్శి కొటారు దేవేంద్ర, వనపర్తి పద్మారావు కుర్రా నాని తదితరులు పాల్గొన్నారు.