మరణించిన జనసైనికుని కుటుంబానికి జనసేన 5 లక్షల భీమా చెక్

అమలాపురం, ఇటీవల మరణించిన అమలాపురం జనసైనికుడు తెవికిటి వెంకటేష్ కి జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ 5 లక్షలరూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు. శనివారం 5లక్షల భీమా చెక్ ను వెంకటేష్ కుటుంబానికి అమలాపురం రూరల్ జనుపల్లిలో జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షత వహించారు. దళిత కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ ఆదుకోవడంలో చూపిన చొరవ ప్రశంసనీయమైనది అని రాజబాబు అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసినజిల్లా అధ్యక్షులు దుర్గేష్ మాట్లాడుతూ.. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటేష్ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పితాని బాల కృష్ణ, అయితాబత్తుల ఉమామహేశ్వరావు, జనసేన పార్టీ అమలాపురం రూరల్ అధ్యక్షులు లింగోలు పండు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్లనాగ సతీష్, కొప్పుల నాగ మానస, సుదా చిన్నా, మహాదశ నాగేశ్వర రావు, ఆర్ డి ఎస్ ప్రసాద్, వాకపల్లి శ్రీను, గండి స్వామి, నల్లా వెంకటేశ్వరరావు, పిండి రాజా తదితరులు పాల్గొన్నారు.